చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ను విమర్శిస్తుండగా జై కేసారం గ్రామస్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూర నర్సయ్య గౌడ్ను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.