ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని కుప్టి వంతెన వద్ద కింద పడిపోయి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగినవెంటనే ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ అందులోనుంచి దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, కింద పడిఉన్న లారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.