యాదాద్రి భువనగిరి : భువనగిరి(Bhuvanagiri) మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో(Congress Party) లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ పచ్చాల హేమలత(Hemalatha) బుధవారం తన పదవికి రాజీనామా (councilor resigned) చేశారు.
రాజీనామ లేఖను మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ కొండల్ రావుకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లా డుతూ..చైర్మన్ ఎన్నికకు తాము సహకరించామని తెలిపారు. అయినా కూడా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) తమకు వ్యక్తిగతంగా విలువలు ఇవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేస్తామని వెల్లడించారు.