హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం నియమించారు. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన, యువ నాయకులకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. మాజీ ఎమ్మెల్సీ, మం డలి చైర్మన్ ప్రొటెంగా వ్యవహరించిన వీ భూపాల్రెడ్డిని తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించారు. భూపాల్రెడ్డి 2014 నుంచి బీఆర్ఎస్ నాయకుడిగా విశేష సేవలందిస్తున్నారు. మూడు సార్లు మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నియమి తులయ్యారు. 2021లో మండలి ప్రొటైమ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కమిషన్ సభ్యులుగా హైదరాబాద్కు చెందిన గోసుల శ్రీనివాస్యాదవ్, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం రెనెవట్లకు చెందిన మహమ్మద్ సలీంను నియమించారు.
స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మార్వెల్లికి చెంది న మఠం భిక్షపతి నియమితులయ్యారు. భిక్షపతి 2004 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. జోగిపేటలో 56రోజుల దీక్ష చేపట్టారు. ఎంపీటీసీగా గెలుపొందారు. స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన మహ్మద్ తన్వీర్ నియమితులయ్యారు. మాజీ మంత్రి దివంగత మహమ్మద్ ఫరీదుద్దీన్ కొడుకుగా తన్వీర్ పేరుగాంచారు. తండ్రి రాజకీయలను దగ్గరగా గమనించారు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కృషి చేశారు. తమపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు భూపాల్రెడ్డి, గోసుల శ్రీనివాస్యాదవ్, మహమ్మద్ సలీం, మఠం భిక్షపతి, తన్వీర్ కృతజ్ఞతలు తెలిపారు.