హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లా ఉల్లేపల్లి భూక్యాతండాకు చెందిన భూక్యా యశ్వంత్ నాయక్ ఎవరెస్ట్ బేస్క్యాంపులో త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆదివారం 5,364 మీటర్ల ఎత్తులోని బేస్క్యాంపునకు చేరుకున్నాడు.
భారత సైన్యంలో చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ ఇప్పటి వరకు కిలిమంజారో, మౌంట్ యునెమ్, మౌంట్ ఎల్బ్రస్ వంటి పర్వతాలను అధిరోహించాడు. ఆర్మీలో చేరేందుకు హైదరాబాద్లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యశ్వంత్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాగ్రం దిశగా అడుగులు వేస్తున్నాడు.