ఖానాపూర్ రూరల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల శాఖ యూత్ ఉపాధ్యక్షుడు సుద్దాల మహిపాల్.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్నాయక్ అధిక మెజార్టీతో గెలవాలని మంగళవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయంలో శివుడికి పూజలు చేశారు.
అనంతరం కేదార్నాథ్ ఆలయం వద్ద, మంచు పర్వతంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, భూక్యా జాన్సన్నాయక్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించారు.