CM KCR | హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్య రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా దేశంలో మరెకడా అమలు కావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్ఞానకేంద్రాలుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న అంబేదర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం సహాయంతో ఎంతోమంది దళితబిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుండటం ఆనందంగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి అమలుపై దేశమంతా తెలంగాణను చూసి నేర్చుకోవాలి.
దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉన్నదని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మగౌరవం దిశగా పయనించేలా కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. ఇది యావత్తు దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులు, దళితులపై దేశంలో జరుగుతున్న దమనకాండను సీఎం కేసీఆర్తో ఆజాద్ చర్చించారు. అనంతరం ఆజాద్ మాట్లాడుతూ . తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్తులో దేశంలోని దళితుల సమస్యల పరిషారానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితబంధు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని ప్రశంసించారు. ఈ పథకం విజయగాథలను తాను తెలుసుకొన్నానని, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని చెప్పారు. ఇది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ కొనియాడారు.
అంబేద్కర్ ఆశయాలు సాకారం
అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదని చంద్రశేఖర్ ఆజాద్ కితాబిచ్చారు. ప్రపంచంలోనే ఎకడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డపై 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సీఎం కేసీఆర్కు అంబేదర్ పట్ల ఉన్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిదని వివరించారు. దళిత, బహుజన, పీడిత వర్గాల ప్రగతి లక్ష్యంగా పాలనను అందించే ప్రజాస్వామిక సౌధంగా డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయాన్ని నిర్మించడం వెనుక సీఎం కేసీఆర్ దార్శనికత మహోన్నతమైనదని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా గురుకుల విద్య దేశంలో మరెకడా అమలు కావట్లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయని అభివర్ణించారు. దేశ విదేశాల్లో దళితబిడ్డలు చదువుకొనే దిశగా ఆర్థిక సహాయం అందిస్తూ అంబేదర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలుచేస్తున్న విషయం తాను తెలుసుకున్నానని, ఆ పథకం సహాయంతో ఇప్పటికే ఎంతోమంది దళితబిడ్డలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుండడం తనకెంతో ఆనందంగా ఉన్నదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి అమలుతీరు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలని ఆజాద్ సూచించారు. దళిత జనబాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మహాసభలకు ఆహ్వానం
రాజస్థాన్లోని జైపూర్లో ఆగస్టు 26న జరిగే భీమ్ ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సీఎం కేసీఆర్ను చంద్రశేఖర్ ఆజాద్ ఆహ్వానించారు. ఆజాద్వెంట మంత్రులు హరీశ్రావు, జీ జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ బాల సుమన్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు.