హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రజల అవసరాలకు తగినట్టుగా విద్యుదుత్పత్తి చేయడంతోపాటు సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, ఇతర అధికారుతో విద్యుత్తుపై మంత్రి సమీక్షించారు. సెంట్రల్ ఎ లక్ట్రిసిటీ అథారిటీ అంచనా ల ప్రకారం 2031-32 నా టికి పెరగనున్న రాష్ట్ర విద్యు త్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఎన్టీపీసీ ఫేజ్-2లో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని, జైపూర్ థర్మల్ పవర్స్టేషన్లో అదనంగా 800 మెగావాట్ల (మూడో యూనిట్) ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తొలి విడతలో 1600 మెగావాట్ల ప్లాంట్ను నిర్మిస్తున్నట్టు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. మంత్రి భట్టి గురువారం ఎస్పీడీసీఎల్ కార్యాలయా న్ని సందర్శించారు. ఆ సంస్థ సీఎండీ ఫారూ ఖీ, డైరెక్టర్లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్ల అసోసియేషన్ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య ఆధర్వ్యంలో ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో మంత్రిని భట్టిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాలువాకప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీఏవోఏటీ వైస్ ప్రెసిడెంట్ నాజర్ షరీఫ్, జాయింట్ సెక్రటరీలు వీ పరమేశ్, జే స్వామి, ఎస్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ కే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.