Gaddenna Vagu Project | భారీ వర్షాలతో గడ్డెన్నవాగుకు భారీగా వరద నీరు చేరుతోంది. దాదాపు ప్రాజెక్టు నిండడంతో అధికారులు ఆరుగేట్లను ఎత్తిదిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి దాదాపులక్షకుపైగా క్యూసెక్కులు అవుట్ఫ్లో ఉన్నది. అయితే, ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భైంసాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. భైంసాలోని ఆటోనగర్, కుబీర్ చౌరస్తా ప్రాంతంలో నీటమునిగింది. వినాయక్నగర్, డబ్బా గల్లీ, కమలాటాకీస్ ప్రాంతంలోకి వరద నీరు చేరింది. అలాగే భైంసా మండలం పల్సికర్ రంగారావు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. గుడెంగాం వంతెనపై నుంచి రంగారావు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రవహిస్తున్నది. మహాగాం గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి వరద వచ్చి చేరింది. బిద్రెల్లి వద్ద హైవేపై వంతెన నుంచి వరద నీరు వెళ్తున్నది. నిర్మల్ – నిజామాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.