భద్రాద్రి కొత్తగూడెం : మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అలీ(40) ఓ మైనర్పై కొద్ది నెలల క్రితం అత్యాచారం చేశాడు. దీంతో బాధిత కుటుంబం మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏఎస్పీ శబరీష్ సమగ్ర విచారణ చేపట్టి, తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి కోర్టు మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 6 వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శబరీష్, ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్, సీడీవో రమేశ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వర్ రావుతో పాటు కానిస్టేబుల్ రమేశ్ను జిల్లా ఎస్పీ సునీల్ దత్ అభినందించారు.