భద్రాచలం, మార్చి 5: ‘నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు నమ్మకాన్ని వమ్ముచేసే వ్యక్తిత్వం తనది కాదని పేర్కొన్నారు.
గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయనని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మున్ముందు మంత్రులనూ కలుస్తానని చెప్పారు. 11న భద్రాచలంలో సీఎం పర్యటింనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాసమస్యలను గుర్తించి సీఎంకు నివేదించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెళ్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు సత్యనారాయణమూర్తి, రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, బొంబోతుల రాజీవ్, గాడి విజయ్, చుక్కా సుధాకర్, మామిడి పుల్లారావు, పెద్దినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.