భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24 (నమస్తే తె లంగాణ): బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య వాగ్వాదానికి దిగారు. రేగా కాంతారావు మాట్లాడుతుండగా పొదెం దురుసుగా ప్రవర్తించి తన కుటిల స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. గురువారం భద్రాచలం పట్టణంలోని సబ్కలెక్టరేట్లో కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కు ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందు లో ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నా రు.
రేగా కాంతారావు మాట్లాడుతుండగా ఎమ్మె ల్యే పొదెం కలుగజేసుకున్నారు. ‘భద్రాచలంలో మీకేంటి పని? ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ అంటూ అనుచితంగా మాట్లాడారు. ఇందుకు రేగా బదిలిస్తూ.. ‘నేను ప్రభుత్వ విప్ను. ప్రభు త్వ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ప్రభుత్వ విప్ గా సంక్షేమ పథకాల గురించి మాట్లాడే హక్కు నాకుంది’ అని సమాధానమిచ్చారు. అయినా.. ఎమ్మెల్యే పొదెం వినకుండా ప్రభుత్వ విప్ చేతి లో నుంచి మైక్ లాక్కున్నారు. దీంతో తీరుపై అధికారులు, చెక్కులు తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు నివ్వెరపోయారు. ఎమ్మెల్సీ తాతా మధు కలుగజేసుకుని ఎమ్మెల్యే వీరయ్యకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.