ఉండవెల్లి , ఏప్రిల్ 26: 25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా నెమ్మదించింది.
బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వేగం అదుపుతప్పి బస్సు రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. –