మహబూబ్నగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా ఎన్నికైన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు కోటలు దాటాయి.. కానీ, చే తలే గడప కూడా దాటడం లేదు.. ‘నా జడ్జర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బెల్టుషాపులు నడవద్దు.. ఎక్కడ షాపులు నడిచినా.. ఆ స మాచారం అందిస్తే రూ.10 వేలు నజరానా ఇస్తా’ అని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్రెడ్డి జనవరి 21న ప్రకటించారు.
జడ్చర్ల పోలీస్స్టేషన్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ నేతృత్వంలో జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఎట్టిపరిస్థితుల్లో గ్రామాల్లో, పట్టణాల్లో బెల్టుదుకాణాలు నడవకుం డా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ, నియోజకవర్గవ్యాప్తంగా 24 గంటలు బెల్ట్ షాపులు బాజాప్తా నడుస్తున్నాయి. గ్రామాల్లో జాతర్ల సీజన్ కావడంతో బెల్ట్షాపు నిర్వాహకుల పంట పండుతున్నది.
వీరి భరతం పడ్తానన్న ఎమ్మెల్యేకు సమాచా రం ఇస్తే నజరానా వస్తుందని భావించిన జనం ఆశ తో ఎమ్మెల్యేకు ఫోన్లు చేస్తే ఎత్తకపోవడంతో విస్తుపోతున్నారు. ఒకవేళ ఎత్తితే ‘నాకేందుకు ఫోన్ చేస్తారు? పోలీసులకు చేయండి’..? మీకు బాధ్యత లేదా? అని కసురుకుంటున్నట్టు తెలిసింది. సోషల్ మీడియాలో సదరు ఎమ్మెల్యే నిర్వాకం ట్రోలింగ్ అవుతున్నది. వైన్స్లు ఉన్నప్పటికీ 10 రూపాయలు, 20 రూపాయల చొప్పున ఎక్కువ ధర ఇచ్చి మరీ తెచ్చుకొని తాగుతున్నారు.