భువనగిరి అర్బన్, ఏప్రిల్1 : జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచాలని జడ్పీటీసీ నగేశ్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నాల్గో స్థాయి సంఘం(విద్య, వైద్య) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలోని ప్రభు త్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయా.., తగ్గుతున్నా..అనే లెక్కను కచ్చితంగా చెప్పాలని వైద్యాధికారులకు సూచించారు. ఆలేరు దవాఖానలో ఆశ వర్కర్లు గర్భిణులకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మలేరియా, కుక్కకాటు, ఇతర వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు దవాఖానల్లో అందుబాటులో ఉం చాలని, జిల్లాలో శిశు మరణాల సంఖ్యను తగ్గించాలన్నారు. భువనగిరి ఏరియా దవాఖానలో కొవిడ్ పరీక్ష కోసం వచ్చే వారు ఎండలో నిలబడుతున్నారని వారికి నీడ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలోని దవాఖానల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
ఐదోస్థాయి సంఘం సమావేశం
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదోస్థాయి సంఘం (మహిళా, శిశు సంక్షేమస్థాయి సంఘం) చైర్మన్ ప్రణితాపింగళ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాస్రావు, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, సూపరింటెండెంట్ రవిప్రకాశ్, డీఈవో చైతన్యజైనీ, జడ్పీటీసీ సభ్యురాలు కె.లక్ష్మి, డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు స్వరాజ్యం, రాణి, సఖీ కేంద్రం అధికారి వనజ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’