సుల్తాన్బజార్, ఆగస్టు 10: గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని గురువారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడిలో పాల్గొన్న సుమారు 70 మందిపై బేగంబజార్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మూకుమ్మడిగా ఒకేసారి వందలాదిగా తరలివచ్చి ముట్టడికి కారకులైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ ముట్టడికి సూత్రధారి అయిన కోచింగ్ సెంటర్ యజమాని అశోక్ను పోలీసులు అరెస్ట్ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. నిందితులందరికీ నోటీసులు పంపినట్టు తెలిసింది.