మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది, దహన సంస్కారాలకు వెళ్లిన గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత(70) అనే మహిళ మృతి చెందింది. ఆమెకు దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శ్మశాన వాటిక వద్దకు వెళ్లారు.
ఈ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో గ్రామస్థులంతా పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో దేవులవాడ గ్రామానికి చెందిన బొల్లంపల్లి బాపు(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.