హైదరాబాద్ : రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, సంబం ధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ మేరకు మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సోమవారం టెలీఫోన్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ‘ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొద్ది రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చ రించింది. ఇదే సమయంలో వర్ష ప్రభావం వల్ల రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాలు, ప్రత్యేకించి ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కాజీపేట, జనగామ ప్రాంతాల్లో అధికారులు అలెర్ట్గా ఉండాల’ ని ఆదేశించారు.
గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ను ఆదేశించా రు. రోడ్డుపై ఒక అంగుళం కన్న ఎక్కువ ఎత్తుగా నీరు ప్రవహించినట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును తాత్కాలికంగా బ్లాక్ చేయాలని సూచించారు. వరద నష్ఠాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి టోల్ ఫ్రీ నెంబర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, వరంగల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని వివరించారు.
వర్షాల వల్ల కోతలకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు సేకరించాల ని, వాటి పునరుద్ధరణ, మరమ్మ తుల చర్యలకు ఉపక్రమించాలని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు .