ఎల్బీనగర్, జూలై 4 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం లింగోజిగూడ డివిజన్ ఆల్తాఫ్నగర్లో పర్యటించి కాలనీ వాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్తాఫ్నగర్ వాసుల నుంచి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి నివాసితుల అంగీకార పత్రంపై సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి స్థలాలను ఇచ్చేందుకు బస్తీవాసులు అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎక్కువ నష్టం జరగకుండా బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బాక్స్ డ్రెయిన్ పూర్తయితే కాలనీల్లో వరదనీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తిలక్రావు, మధుసాగర్, కాలనీవాసులు వెంకట్రెడ్డి, జంగయ్య, మహేందర్రెడ్డి, శ్రీకాంత్, నర్సింహ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.