కాచిగూడ, ఏప్రిల్ 13: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 119 బీసీ స్టడీ సర్కిళ్లను మంజూరుచేయడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడలో సమావేశాన్ని నిర్వహించారు. రా ష్ట్రంలో 120 గురుకుల పాఠశాలలు మం జూరుచేయాలని ఇటీవల ఆర్ కృష్ణయ్య అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ స్పందించి 119 బీసీ స్టడీ సర్కిళ్లను మంజూరు చేసినందుకు కేసీఆర్కు సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. 52 శాతం ఉన్న బీసీల కోసం ఆరేండ్లలో సీఎం కేసీఆర్ 240 గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించారని కొనియాడారు. సాగర్లో బీసీ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజార్జీతో గెలిపించాలని ముమ్మర ప్రచారాలు నిర్వహించిన ట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్, నందగోపాల్, ఉదయ్, సతీశ్,రాఘవ, బబ్లూగౌడ్, నిఖిల్ పాల్గొన్నారు.