హనుమకొండ చౌరస్తా, జూలై 7: హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్స్కూల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎంపికైన బాలుర ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్ హకింపేటలో జరిగిన రాష్ర్టస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్స్కూల్కు ఎంపికైన బాలుర సర్టిఫికెట్లను జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డివైఎస్ఓ కొత్త ప్రశాంత్ స్వాగతం పలికి అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతులు, నాణ్యమైన క్రీడా శిక్షణ, విద్యా సౌకర్యాల గురించి వివరించారు.
స్పోర్ట్స్ స్కూల్లో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో సాధన చేస్తూ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి హనుమకొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. బాలికలు, బాలుర అడ్మిషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఎంపికైన వారికి క్రీడా శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్లు, కార్యాలయ సిబ్బంది, ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.