హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కీలక పోస్టింగులు, బదిలీల్లో ఒకే కులం వారికి పెద్దపీట వేయకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించాలని, అన్ని కులాల్లో ప్రతిభ ఉన్న నీతి నిజాయితీ గల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళా అధికారులకు ప్రాధాన్యతనివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది మంది అగ్రకుల అధికారుల మాటలు వినకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.