హైదరాబాద్, మార్చి21 (నమస్తే తెలంగాణ): నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. గురువారం సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్తోపాటు పలువురు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు.
పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి పరిమితం అవుతున్నాయని సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు ఆనందం, తులసీ శ్రీమన్, ఊర్మిళ, స్వామి, వీరాస్వామి యాదవ్, లక్ష్మణ్, కృష్ణలత పాల్గొన్నారు.