హైదరాబాద్, అక్టోబర్31 (నమస్తే తెలంగాణ): బీసీ ఏ గ్రూప్లో ముదిరాజ్లతోపాటు, ఏ ఇతర కులాన్నీ చేర్చొద్దని తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును కలిసి విన్నవించింది. అనంతరామన్ కమిటీ ఆధారంగా రాష్ట్రంలోని 93 కులాలను బీసీ జాబితాలో చేర్చి నాలుగు విభాగాలుగా విభజించారని తెలిపారు. బీసీ ఏ గ్రూపులో అర్ధసంచార, సంచార, విముక్తి, ఆదిమ జాతులను చేర్చారని తెలిపారు.
ఈ కులాలు ఇప్పటికీ దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఏ గ్రూపులోని కులాలను యథాతథంగా ఉంచాలని కోరారు. వకుళాభరణంను కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావు, ప్రధాన కార్యదర్శులు యుగంధర్, ప్రతికంఠం పూర్ణచందర్రాజు, మీడియా కన్వీనర్ భాస్కరుడు, ఇతర నాయకులు కరుణాకర్, రేణుక తదితరులున్నారు.