హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): 2014 నుంచి 2026 మధ్య జరిగిన నియామకాలు, డైరెక్టర్లుగా పనిచేసిన వారి సామాజికవర్గం సహా వివరాలన్నీ 15రోజుల్లోగా అందించాలని విద్యుత్తు సంస్థను రాష్ట్ర బీసీ కమిషన్ ఆదేశించింది. సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీ స్ అసోసియేషన్ ఫిర్యాదు క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి ట్రాన్స్కో కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.
సీఎండీ కృష్ణభాసర్, డైరెక్టర్లు శ్రీనివాసులు, లత, వినోద్తో సమీక్షించి, రిజర్వేషన్లు సహా పలు అంశాలపై విచారించారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల ప్రమోషన్లు, సీనియారిటీ, ఇతర అంశాలను పరిశీలించాలని, సంస్థలో బీసీ సెల్ ఏర్పాటుకు వసతులు కల్పించాలని చైర్మన్ నిరంజన్ సూచించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్య కార్యదర్శి బాల మాయదేవి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమారస్వామి, వెంకన్నగౌడ్, ట్రాన్స్కో అధ్యక్ష కార్యదర్శులు ఎం అశోక్కుమార్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.