Bathukamma Celebrations | భారత జాగృతి ఆధ్వర్యంలో గురువారం ముంబయిలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. దాదర్ ఈస్ట్ స్వామి నారాయణ్ రోడ్లోని యోగి హాల్లో సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు జరిగే ఈ సంబరాల్లో ప్రముఖ గాయని శవరంజని, నిరంజనితోపాటు జానపద గాయకులు మాట్ల తిరుపతి, గాయని శిరీష ఆటపాటలతో అలరించనున్నారు. చక్కగా అలంకరించిన బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ముంబయి చుట్టుపక్కల ఉన్న తెలుగింటి ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భారత జాగృతి మహారాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ సులగే కోరారు.