హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణీదేవి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటమాడారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలయ్.. బలయ్కు రావాలని ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం
ఈ నెల 6న నిర్వహించే అలయ్..బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అలయ్..బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. హైదరాబాద్లోని కవిత ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు.