హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి 3వేలకుపైగా ఎన్నారై కుటుంబసభ్యులు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా స్థానిక ఎంపీ సీమ మల్హోత్రా, మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ పాల్గొన్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్గౌడ్ దూసరి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నారైలంతా చేనేత వస్ర్తాలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలందరూ గౌరీదేవికి పూజలు చేసి, బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. తమను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టాక్ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, సత్య చిలుముల టాక్ ప్రధాన కార్యదర్శులు సురేశ్ బుడగం, జాహ్నవి దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేశ్ కుప్పలా, గణేష్ పాస్తం, రాకేశ్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, మాధవ రెడ్డి, సతీశ్ రెడ్డి గొట్టిముకుల, శ్రావ్య వందనపు, హరిగౌడ్ నవాబ్పేట్, క్రాంతి రేటినేని, శ్వేతా మహేందర్, శశి దొడ్లే, శ్రీలక్ష్మి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, మౌనిక, ప్రవీణ్ వీర, శ్రీకాంత్ జెల్ల, శైలజ, శ్రీధర్ రావు, కార్తీక్, ప్రశాంత్ మామిడాల, మహేందర్, శ్రీవిద్య, స్నేహ, విజిత, సత్యం కంది, రంజిత్, వంశీ, నరేశ్ నాగరాజు, మ్యాడి, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.