మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 16 : మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో బస్తీ దవాఖానాలపై ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే హాస్పిటళ్లు ఉంటే వాటికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 256 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. మరో 35 ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 59, ఇతర మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 40 కలిపి మొత్తంగా 390 బస్తీ దవాఖానాలను ఏర్పాటు కానున్నాయి. వీటిని జిల్లా ఆరోగ్య సొసైటీ ద్వారా నిర్వహించేందుకు ఆయా మున్సిపల్ కౌన్సిళ్లు తీర్మానాలను చేయాల్సి ఉంటుందని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు.
మార్గదర్శకాలు..