నిర్మల్ : బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 51.77 లక్షలు వచ్చిందని ఆలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఆదాయం 39 రోజులది మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. గుర్తు తెలియని భక్తులు ఎనిమిది విదేశీ కరెన్సీ నోట్లను సరస్వతి దేవీకి కానుకగా సమర్పించారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 7వ తేదీ మధ్యలో అమ్మవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు.