బాన్సువాడ, నవంబర్ 4: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశా రు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉన్నారని, రాబోవు రోజుల్లో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.