హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను మరో పది రోజులపాటు ప్రభుత్వం పొడిగించింది. అదేవిధంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని 1 గంటల వరకు పొడింగించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ పనివేళల్లో మార్పులు చేశారు. ఈ మార్గదర్శకాలు ఈ నెల 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో సోమవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.