నల్లగొండ : దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగారు.
అందులో గురువారం మొదటి రోజు సమ్మెతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, బ్యాంకు ఉద్యోగుల న్యాయబద్ధమైన సమ్మెకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తమ మద్దతు పలికారు.