నాంపల్లి క్రిమినల్ కోర్ట్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): చంచల్గూడ జైలులో ఉన్న ఎమ్మెల్యేలకు ఎరకేసులో నిందితుడు నందకుమార్ను విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేశ్బాబు, హీరో రానాకు సంబంధించిన భూ వివాదంతోపాటు ‘దక్కన్ కిచెన్’ అక్రమ భవన నిర్మాణ కేసులో నందకుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.
అయితే, మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో కస్టడీ పిటిషన్పై జడ్జి సోమవారం వాదనలు వినే అవకాశం ఉంది. కాగా, బెయిల్పై విడుదలైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు.