Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్( Telangana State Commission for Women )
ప్రకటించింది. బీఆర్ఎస్( BRS Party ) ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.
ఈ మేరకు మహిళా కమిషన్ బండి సంజయ్ను మార్చి 15వ తేదీన కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించగా తనకు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని, ఈ నెల 18వ తేదీన కమిషన్ చైర్ పర్సన్ సూచించిన సమయానికి హాజరు అవుతానని లేఖలో అభ్యర్థించారు. కమిషన్ అందుకు సానుకూలంగా స్పందించి 18న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించింది. 18న హాజరుకాలేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసు ద్వారా హెచ్చరించింది.