Chada Venkat Reddy | బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. గురువారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీపీఐ నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి చాడ హాజరై మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్ చిచ్చు పెడుతున్నాడని దుయ్యబట్టారు.