హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్లు(Sarpanches) గ్రామాభివృద్ధి కోసం సొంత నిధులతో చేసిన పనులకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున సర్పంచుల పెండింగ్ బిల్లులు(Pending bills) తక్షణమే చెల్లించాలని కోరుతూ..సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావొస్తుంది. గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లు చేసిన పనులకు పెండిరగ్ బిల్లులపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్లు ఆందోళన చెందుతూ, ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభకు గురవుతున్నారు.
సర్పంచ్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి చేసిన పనులకు సంబంధించి 1850 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని లేఖలో కోరారు.