దుమ్ముగూడెం, ఏప్రిల్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బండారుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. క్లీన్ అండ్ గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ, ైక్లెమేట్ రెసిడెంట్పై అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులు అవలంబిస్తున్న పాఠశాలలపై కేంద్ర ప్రభుత్వం యునిసెఫ్ సౌజన్యంతో పుస్తకాన్ని ప్రచురించింది.
ఆ పుస్తకంలో రాష్ట్రం నుంచి బండారుగూడెం బడికి చోటు లభించింది. మంగళవారం యునిసెఫ్ ప్రతినిధి శ్రేయాస్ సజీవన్ తన బృందంతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో టాయిలెట్స్, హ్యాండ్వాష్, గార్డెనింగ్, డైనింగ్ వసతులపై ఆరా తీశారు. హెచ్ఎం బీ శ్రీనివాసరావుకు పాఠశాలల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు సంబంధించిన బుక్లెట్ అందజేశారు.