వరంగల్ : మున్సిపల్ ఓట్ల లెక్కింపు అనంతరం నిర్వహించే విజయోత్సవ ర్యాలీలపై నిషేధాన్ని విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా వ్యాధిని నియంత్రించడంలో భాగంగా ఇటీవల ముగిసిన జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు సంబంధించిన రేపు జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం గెలిచిన అభ్యర్థులు చెపట్టే విజయోత్సవ ర్యాలీలను పూర్తిగా నిషేధించామన్నారు.
అదే విధంగా ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసరాల్లోను 144 సెక్షన్ అమలులో ఉన్నందును గుంపులు, గుంపులుగా ఉండటం నేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. కరోనా నివారణకై అభ్యర్థులు తమ వంతు బాధ్యతగా పోలీసుల సూచనలను పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం