హైదరాబాద్ : దేశమంతా కరెంట్ కటకట ఉన్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్ కోతలు లేవని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజవకర్గంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పెల సాయిరెడ్డితోపాటు 20మంది కీలక నేతలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారికి మంత్రి ప్రశాంత్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభావితులై, అభివృద్ధి వైపే తాము ఉంటామని నిర్ణయం తీసుకొని.. టీఆర్ఎస్ పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. పార్టీలో చేరిన వారికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి జరుగుతుందని, రూ.100 కోట్లతో చెక్డ్యామ్లు నిర్మించి ఏళ్లతరబడి ఉన్న సాగునీటి గోసను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు.
అలాగే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ, వరద కాలువలు మండు వేసవిలో కూడా నిండుకుండలా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రంలో విదేశీ కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో మెండోర సర్పంచ్ మచ్చర్ల రాజారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, ఉపాధ్యక్షుడు బడాల గంగారెడ్డి, సొసైటి చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.