హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లోనే అవినీతి ఎక్కువగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అవినీతి అంశంపై ‘లోక్నీతి-సీఎస్డీస్’ 13 రాష్ర్టాల్లో చేసిన సర్వే ఫలితాలను గురువారం ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. ఈ సర్వే ప్రకారం అవినీతిలో బీజేపీ రాష్ర్టాల్లో ముందు వరుసలో ఉండగా, తెలంగాణ ఆఖరి స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ ట్వీట్కు విశేష స్పందన వస్తున్నది. కొందరు నెటిజన్లు మింట్ పత్రిక వెల్లడించిన లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వేను డౌన్లోడ్ చేసుకొని బీజేపీ రాష్ర్టాల్లోని అవినీతిపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మీమ్స్ చేస్తూ బీజేపీ రాష్ర్టాలను ఆటాడుకుంటున్నారు.