వరంగల్ : అరచేతికి తేనె పూసి మోచేత్తో సీఎం రేవంత్రెడ్డి నాకమంటున్నాడు. 420 మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఉచిత బస్సు తప్పా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman,) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో ఒక్క జాబు క్యాలెండర్ లేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు.
మూడు వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా పట్టభద్రులు ఉన్నారు. పట్టభద్రులే నాలుగు కోట్ల ప్రజలకు గొంతుక కావాలన్నారు. మూడు జిల్లాలు చైతన్యానికి ప్రతీక అని ప్రశంసించారు. రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి(MLC elections) గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజారాజ్యం పేరుతో పైసల రాజ్యాన్ని నిర్మించుకున్న రేవంత్ రెడ్డికేసీర్ సంక్షేమ పథకాలకు కోత పెట్టారని విమర్శించారు.
తీన్మార్ మల్లన్నవి బ్లాక్మెయిల్ రాజకీయాలన్నారు. రేవంత్ రెడ్డి దురహంకారాన్ని గద్దేదించినందుకు ఈ ఎన్నికలు గుణపాఠం కావాలన్నారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేస్తా అన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. రాకేష్ రెడ్డిని గెలిపిస్తేనే జాబ్ క్యాలెండర్ వస్తుంది. నిరుద్యోగ భృతి వస్తుంది. రైతులకు రైతుబంధు రైతు భరోసా వస్తుంది. 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు స్కూటీలు వస్తాయన్నారు.