వరంగల్ అర్బన్ : త్వరలో జరుగబోయే బల్దియా ఎన్నికలకు శిక్షణ నిమిత్తం ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్ఓ, ఏఆర్ఓలు శిక్షణకు హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. బల్దియా పరిధిలోని 66 డివిజన్లకు 81 రిటర్నింగ్, 81 సహాయ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని జీహెచ్ ఎంసీ కార్యాలయ 7వ అంతస్తులోని సమావేశ మందిరంలో శిక్షణకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. శిక్షణకు వెళ్లేందుకు జీడబ్ల్యూఎంసీ, వరంగల్ కార్యాలయం నుంచి ఈ నెల 11న ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..