యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్ర దాయరీతిలో ఘన స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయంలో మూలమూర్తులకు దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వ హించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలల ఇబ్బందుల గురించి బెంచ్ ద్వారా స్వీకరించేందుకు కమిషన్ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. బెంచ్ నిర్వ హించేందుకు జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం చాలా బాగా కృషి చేశారని కొనియాడారు. బాలలకు ఇబ్బందులు వాటిళ్లితే తమ బెంచ్ దృష్టికి తీసుకువస్తే అధికార యంత్రాంగంతో కలిసి పరిష్కార మార్గం దిశగా కృషి చేస్తామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ ప్రతి నిత్యం కృషి చేస్తుందన్నారు. కార్యక్ర మంలో ఆలయ ఈవో ఎన్. గీత, ఏఈవోలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.