జగిత్యాల : పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించాలంటే బీఆర్ఎస్ను(BRS) గెలిపించాలని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్(Bajireddy Govardhan) అన్నారు. జగిత్యాల(Jagityala) పట్టణం లోని బీఎల్ఎన్ గార్డెన్స్, దేవి శ్రీ గార్డెన్స్లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోలేకనే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఎంపీగా గెలిప్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.