సుబేదారి, ఫిబ్రవరి 27 : భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్పై సోమవారం హనుమకొండలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఫస్ట్ఇయర్ చదువుతున్న బైరి నరేశ్ సోమవారం అంబ్కేదర్ భవన్ నిర్వహించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీకి వచ్చాడు. విషయం తెలుసుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం 4 గంటలకు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నరేశ్ హనుమకొండ ఏసీపీకి ఫోన్ చేయగా సుబేదారి ఎస్సై రవికుమార్ సిబ్బందితో వెళ్లి నరేశ్ను పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.
కేయూసీ 100 ఫీట్ల రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో సమ్మయ్యనగర్ సమీపంలో కార్యకర్తలు బైక్లు, మూడు కార్లలో వచ్చి పోలీసు వాహనాన్ని అడ్డుకొని నరేశ్పై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టి వెనుక సీట్లో ఉన్న నరేశ్ చొక్కా చించి చితకబాదారు. ఆ తరువాత పోలీసులు నరేశ్ను హనుమకొండ పోలీసు స్టేషన్కు తరలించారు. నరేశ్పై దాడి ఘటనలో బీజేపీ, బజరంగ్దళ్ నాయకుడు సూర్యప్రకాశ్ ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు.