ఎంపీ కే కేశవరావు, మంత్రి గంగులకు ఆహ్వానం
హైదరాబాద్, జూలై31 (నమస్తే తెలంగాణ): బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 7న ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహాసభకు బీసీలందరూ తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం బీసీ ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా కలిసి మహాసభకు ఆహ్వానించారు.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ కే లక్ష్మణ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ను కలిసి మహాసభకు రావాలని కోరారు. 10వేల మందికిపైగా బీసీ ప్రతినిధులు మహాసభకు హాజరవుతారని జాజుల శ్రీనివాస్ తెలిపారు.