హైదరాబాద్: అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభమయింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏయే అంశానికి ఎంత సమయాన్ని కేటాయించాలనే విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.