ఖైరతాబాద్, సెప్టెంబర్ 27: వరద నీటిలో మొసలి కూన ప్రత్యక్షమై అందరినీ కలవరపాటుకు గురిచేసింది. హైద రాబాద్ నగరంలో బుధవారం సాయం త్రం కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చింతలబస్తీ నాలాలో మొసలి పిల్ల కొట్టుకురావడం తో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
వాన నీటి ఉధృతికి కొట్టుకొని వచ్చిన మొసలి పిల్ల నాలా వంతెన నిర్మాణ ప నులు కొనసాగుతున్న చోట కనిపించిం ది. అంతలోనే కనిపించకుండాపోవడం తో అటవీ అధికారులు వెతుకుతున్నారు.