Babu Jagjivan Ram | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ దేశానికి, కార్మికలోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు, ప్రజాసంఘాల నేతల కొనియాడారు. దళితసంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ 117వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జగ్జీవన్రామ్ అణగారినవర్గాల హకుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాజకీయ-సామాజిక యోధుడని కొనియాడారు. దేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పాటుపడ్డారని, నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సమతా స్థల్లో జగ్జీవన్రామ్కు బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు నివాళులర్పించారు.